రూ. 121 కోట్లతో 2 కోట్ల డస్ట్బిన్లు త్వరలో పంపిణీ చేస్తామని డిప్యూటీ సీఎం, మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. పంచాయత్ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్వచ్చంద కార్పొరేషన్పై బూడి ముత్యాల నాయుడు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 461 కోట్లతో గ్రామాలలో పారిశుధ్యం కోసం 5,500 ట్రాక్టర్ల సరఫరా చేస్తామన్నారు. పారిశుధ్య కార్మికులకు ప్రతి నేలా జీతాలు ఖచ్చితంగా ఉండేలా చూడడం, గ్రామాలలో ఘన వ్యర్థ పదార్థాల ట్రీట్మెంట్ కోసం రూ. 143 కోట్లతో 346 వాహనాల కొనుగోలు, రూ. 3 లక్షలతో గ్రామ సచివాలయాల దగ్గర కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణం చేపట్టేల చర్యలు తీసుకుంటామని ముత్యాల నాయుడు తెలిపారు.