Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

నవోదయ విద్యాలయాల ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికి గాను పరీక్ష తేదీని కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు రెండు గంటల సమయం ఉంటుంది. మెంటల్‌ ఎబిలిటీ, అర్థమ్యాటిక్‌, ల్యాంగ్వేజ్‌ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img