సీఎం జగన్ ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ ఖ్యాతి గడిరచాయని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ ఎఫ్ఏఓ అవార్డుకి ఆర్బీకేలను నామినేట్ చేయడం గర్వకారణమని అన్నారు. ఈ మేరకు సచివాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ,‘ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్బీకేలను సీఎం జగన్ తెచ్చారని అన్నారు. రెండేళ్లలోనే మంచి ఫలితాలను తీసుకొచ్చారు. 10,700 రైతు భరోసా కేంద్రాలు రైతులకు మేలు చేసేందుకు తెచ్చాం. ఆర్బీకే లాంటి వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. ప్రతిపక్షానికి అసలు రైతుల కోసం మాట్లాడే అర్హత ఉందా..?. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు మా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. చంద్రబాబు క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకపోతే మేం చెల్లించాం. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నాం.’ అని అన్నారు.