Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

త్వరలో అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తాం: నాగబాబు

ఎన్నో ఏళ్లుగా పెండిరగ్‌లో ఉన్న పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని త్వరలో చేపడతామని వెల్లడిరచారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమిస్తామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు తెలిపారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పొత్తులపై పవన్‌ కల్యాణ్‌ దే తుది నిర్ణయం అని నాగబాబు స్పష్టం చేశారు. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారని, పార్టీ నేతలతో విస్తృతంగా సమావేశాలు ఉంటాయని వెల్లడిరచారు. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షేమ పాలన పేరిట నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img