డి.ఎల్.డి.ఓ పర్యవేక్షణ
విశాలాంధ్ర – తాళ్లపూడి: గ్రీన్ అంబాసిడర్లంతా మరింత చైతన్యవంతంగా పనిచేసి, గ్రామాలను పరిశుభ్రతలో అద్దం లా తయారు చేయాలని, దానికి అవసరమైన వసతులు సమకూర్చు తామని తాళ్లపూడి ఎంపీడీఓ వేణు గోపాలరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని అన్నదేవరపేట లో గ్రామ పంచాయతీ నందు గ్రామపంచాయతీ కార్యదర్శి డి. ఎస్. సి శ్రీనివాస్ ఆధ్వర్యం లో జరిగిన పచ్చదనం- పరిశుభ్రత గ్రామాలు పై ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రాం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీఓ ఎస్. వేణుగోపాల్ రెడ్డి, ఇంచార్జి ఈ.ఓ.పి.ఆర్డీ కె ఎస్. వీరన్న 15 సచివాలయాల గ్రామ కార్యదర్శులు, 15 సచివాలయాల గ్రీన్ అంబాసిడర్స్, గ్రీన్ గార్డ్స్, ఎం.ఆర్.సి రవి ప్రకాష్ పాల్గొన్నారు. ఎంపీడీఓ మాట్లాడుతూ అన్నదేవరపేట గ్రామాన్ని సూపర్ శానిటేషన్ లో భాగంగా గ్రామంలో ఉన్న చెత్త కుప్పలను గుర్తించి వాటిని తొలగించారని, అలాగే గ్రామంలో డోర్ టు డోర్ తిరిగి మహిళలకు తడి చెత్త మరియు పొడి చెత్త వేరుచేసి గ్రీన్ అంబాసిడర్స్ కి ఎలా ఇవ్వాలో అవగాహన కల్పించారన్నారు. డి.ఎల్.డి.ఓ శీర్వారెడ్డి చెత్త సంపద కేంద్రం దగ్గర గ్రీన్ అంబాసిడర్స్ కి, గ్రీన్ గార్డ్స్ కి విధుల్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన వ్యక్తి గత జాగ్రత్తలు, గార్బేజ్ కలెక్షన్ చేయాలో గ్రీన్ అంబాసిడర్స్ కి వివరించారు. పరిశుభ్రత మరియు పచ్చదనంపై అవగాహన కల్పించారు. ముందుగా గాంధీజీ, అంబేడ్కర్ చిత్ర పటాలకు నివాళులు అర్పించి అంబాసిడర్లకు శిక్షణ ప్రారంభించారు.


