Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

ప్రధాని మోదీ
ఆగస్టు 13, 14 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యాచరణ ద్వారా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.భారత త్రివర్ణ పతాకాన్ని 1947 జులై 22వ తేదీన ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన స్పందించారు. త్రివర్ణ పతాకంతో మనకున్న అనుబంధాన్ని ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమం మరింత పెంపొందిస్తుందని మోదీ పేర్కొన్నారు. వలస పాలనలో స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాకం రెపరెపల కోసం పోరాడిన వారి ధైర్యాన్ని, కృషిని ఆయన స్మరించుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img