Monday, May 6, 2024
Monday, May 6, 2024

నేడు ముంపు ప్రాంతాలలో చంద్రబాబు పర్యటన

ఏలూరు: నేడు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి పర్యటిస్తారని టిడిపి ఏలూరు పార్లమెంటు అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. బుధవారం స్థానిక టిడిపి జిల్లా ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశం గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ గోదావరి వరదలలో నిరాశ్రయులైన వరద భాధితులను పరామర్శించడానికి రానున్న నేపధ్యంలో చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి జయమంగళ వెంకటరమణ, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రివర్యులు పీతల సుజాత, ఏలూరు టిడిపి ఇంచార్జి బడేటి రాధాకృష్ణ (చంటి), పోలవరం తెదెపా భాద్యులు బొరగం శ్రీను, ఉప్పాల జగదీష్, పాలి ప్రసాద్, బెజ్జం అచ్చాయమ్మ, కరణం పెద్దిరాజు, కొక్కిరగడ్డ జయరాజు, తెలుగు యువత అధ్యక్షులు రెడ్డి సూర్య చంద్రరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా, మండల, అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img