ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రో సెంటర్ను ఆగస్టు 4వ తేదీన సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. బంజారా హిల్స్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖలకు సిటీ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ఓ మెమోను విడుదలచేశారు. ప్రారంభోత్సవానికి ముందే పెండిరగ్లో ఉన్న అన్ని పనులను పూర్తిచేయాలని ఆయన కోరారు. చరిత్రాత్మక రీతిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం సాగుతోందని, అయితే లాజిస్టిక్స్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్కు సంబంధించిన పెండిరగ్ పనులను పూర్తి చేయాలని కోరారు. కమాండ్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించాలని, దీని ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రతిష్టను ఇనుమడిరప చేయాలని ఆయన తన మెమోలో తెలిపారు.