Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించండి : సర్పంచ్ రాఘవులు

విశాలాంధ్ర వలేటివారిపాలెం.పాఠశాలకు వచ్చు చిన్నారులకు మధ్యాన్న భోజనం రుచికరంగా చేచి వడ్డించాలని కళవల్ల సర్పంచ్ దుగ్గిరాల రాఘవులు అన్నారు.
ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యల పరిష్కారం తో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలించటం తన బాధ్యత అని భావించిన కళవల్ల గ్రామ సర్పంచ్ దుగ్గిరాల రాఘవులు బుధవారం పాఠశాలల్లో వసతులు పరిశీలించడమే కాకుండా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించేందుకు చిన్నారులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులుతో మాట్లాడుతూ భోజనం నాణ్యత విషయంలో రాజీ పడవద్దని, విద్యార్థులకు అందించే భోజనం ఉపాధ్యాయులు భోజనం చేసిన తర్వాత నే వడ్డించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు తిరుపాలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img