జగ్గయ్యపేట నియోజకవర్గంవందలాది మంది కార్యకర్తలు
జగ్గయ్యపేట : భారత కమ్యూనిస్ట్ పార్టీ(సి పి ఐ) శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణలోని ఖమ్మం పట్టణంలో ఆదివారం జరుగుతున్న భారీ బహిరంగ సభకు జగ్గయ్యపేట నియోజకవర్గం నుండి వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ప్రముఖ న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి మరియు జగ్గయ్యపేట పట్టణం నుండి సిపిఐ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కార్మికులు, రైతులు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు తరలి వెళ్లారు. వీరికి సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాసరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఖమ్మం బహిరంగ సభకు తరలివస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు 7000 మందికి పులిహార,మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను అందజేసారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతం నుండి పలు రైళ్లలో ఖమ్మం పట్టణానికి తరలివస్తున్న కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు భోజన సదుపాయం అందించేలా ఈ ఆహార పొట్లాలను ఖమ్మం రైల్వే స్టేషన్ కి తరలించారు. ఎమ్మెల్యే తాతయ్య సోదరులు సాయిప్రసాద్, చిన్నబాబుల ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట నియోజకవర్గ, పట్టణ సమితులు ఎమ్మెల్యేకు అతని సోదరులకు కృతజ్ఞతలు


