Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్

విశాలాంధ్ర నాగులుప్పలపాడు :- మండలంలోని పలు గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈదుమూడి గ్రామంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, కూనం పూర్ణచంద్రరావు, బోలె ఆంజనేయులు అద్వర్యంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు , పోతవరం గ్రామంలో ఎంపీపీ నల్లమలపు అంజమ్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ ఫంక్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు, చీర్వానుప్పాలపాడు గ్రామంలో, ఎంపీటీసీ పొధా పవన్ మేడికొండ మురళి ఆధ్వర్యంలో వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు, కొత్తకోట గ్రామంలో సర్పంచ్ చిన్నం సుజాత సురేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు, వినోదరాయునిపాలెం గ్రామంలో సర్పంచ్ ఘట్టమనేని అశోక్ ఆధ్వర్యంలో వైయస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు, చదలవాడ గ్రామంలో గ్రామ ఉపసర్పంచ్ కోడే సుబ్బారావు ఆధ్వర్యంలో వైయస్సార్ ఫంక్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు, మరియు పలు గ్రామాలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లోనే అర్హులైన పెన్షన్ లబ్ధిదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి వారికి పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీఓ ధనుంజయ వర్మ, డాకా అంజిరెడ్డి, ముదవర్తి క్రాంతి, తదితర గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img