Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

టీడీపీలో నూతన ఉత్తేజం

విశాలాంధ్ర – గుడ్లూరు: గత ఎన్నికల అనంతరం నిరుత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇంటూరి నాగేశ్వరరావు రాక ఒక రకంగా ఉత్సాహాన్ని నింపింది, నింపుతూఉంది. మండలం పరిధిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా , కార్యక్రమం ఏదైనా, ఏ సమయంలో నైనా నేనున్నానని వారికి భరోసాని, నమ్మకాన్ని కలిగిస్తూ, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ, సీనియర్ టీడీపీ నాయకులను కలుపుకొని తన ఆలోచన విధానం ప్రకారం 2024 ఎన్నికలలో టీడీపీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలలో కలియ తిరుగుతూ ముందుకు విజయవంతంగా దూసుకు పోతున్నారు. దీనిలో భాగంగా మండలంలోని శాంతినగర్ గ్రామంలో ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఇంటూరి నాగేశ్వరరావు ఆశీర్వదించారు. శాంతినగర్ గ్రామానికి చెందిన పర్రె అనురాధ కుమారుడు దిలీప్ కుమార్, ప్రస్సన్నలక్ష్మీల వివాహ వేడుక రిసెప్షన్ కార్యక్రమానికి ఇంటూరి హాజరై నూతన దంపతులకు తన ఆశీర్వాదాలను అందజేశారు. అనంతరం సాలిపేట గ్రామంలో టీడీపీ నాయకులు చల్లా వేములస్వామి, పద్మావతి కుమార్తె రాజకుమారి, రాజశేఖర్ ల వివాహ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు దివి శివరాంతో కలసి హాజరయ్యి తమ దీవెనలు అందజేశారు. దారకానిపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు కాకుమాని కోటేశ్వరరావు, కోటేశ్వరమ్మల మనవళ్ళు జై కృష్ణ, జై సింహ ల పంచెకట్టు కార్యక్రమానికి కూడా హాజరై తమ ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ బాధ్యులు జనిగర్ల నాగరాజు, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు దివి సౌభాగ్య, గద్దగుంట శ్రీనివాసులు, పర్రె రామారావు, అట్లా కోటయ్య, చల్లా రామ్మోహన్, యనమల రామారావు, బ్రహ్మయ్య తలకాయల శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img