Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

గాదెలవలస సచివాలయాన్ని సందర్శించిన కొత్త ఎంపిడిఓ

విశాలాంధ్ర,సీతానగరం: మండలములోని గాదెలవలస సచివాలయాన్ని కొత్తగా విచ్చేసిన ఎంపిడిఒ బి. కృష్ణమహేశ్ రెడ్డి మొదటిసారిగా బుదవారం ఆకస్మిక సందర్శన చేశారు. సచివాలయంసిబ్బంది, గ్రామవాలంటీర్లు, క్లాప్ మిత్రలతో పలుఅంశాలపై మాట్లాడారు.ప్రభుత్వ సంక్షేమపథకాలను అర్హులందరికీ అందించడానికి కృషి చేయాలని కోరారు.  గురువారం జరగనున్న గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంకు సంబందించి అన్ని నివేదికలు సిద్ధం చేసుకోవాలని కోరారు. మూడు గ్రామపంచాయితీల్లో ఆన్ని అంశాలతో సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు సిద్ధం చేసుకోవాలని కోరారు.ఆనంతరం గ్రామంలోని ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామంలో నిర్మించిన సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వెల్ నెస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈకార్యక్రమంలో పరిపాలన అధికారి ప్రసాద్, ఈఓపిఅర్డి వర్మ,సర్పంచ్ తిరుపతిరావు,సెక్రటరీ శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img