Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డ్రోన్ ద్వారా రీ సర్వే

విశాలాంధ్ర సంతనూతలపాడు : మండలంలోని కొనగానివారి పాలెం గ్రామంలో జగనన్న సమగ్ర భూ హక్కు భూ రక్ష పథకం క్రింద రెవెన్యూ భూములను ఇండ్లను డ్రోన్ ద్వారా రీ సర్వే కార్యక్రమాన్ని గురువారం మండల వైసీపీ కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి ప్రారంభించారు .డ్రోన్ ద్వారా సర్వే కార్యక్రమం మొదటి విడతగా మండలంలోని గురువారెడ్డి పాలెం లో నిర్వహించి పూర్తిచేశారు. రెండవ విడతగా కొనగానివారి పాలెం తో పాటు పడమటి తక్కెళ్ళపాడు గుమ్మళంపాడు ఎనికపాడు మద్దులూరు వేములపాడు గ్రామాలలో కూడా భూ సర్వే నిర్వహించనున్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి ఎస్ వి ప్రసాద్ ఈవోఆర్ డి జి రామకృష్ణ మండల సర్వేయర్ నాళం వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శులు కే రాధిక మీరా గ్రామ నాయకులు టి శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img