Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జిల్లా ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నిక

విశాలాంధ్ర- హనుమంతునిపాడు: ప్రకాశం జిల్లా ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షులుగా హనుమంతునిపాడు గ్రామానికి చెందిన మండల ఎంపీటీసీ ఉడుముల వెంకట సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గురువారం ఒంగోలు పట్టణంలోని మల్లయ్య లింగం భవన్ లో నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఎంపీటీసీల జిల్లా సమావేశంలో ఎంపీటీసీల సమస్యలపై చర్చించడం జరిగింది.అలానే జిల్లా సంఘం ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షులుగా ఉడుముల వెంకట సుబ్బారెడ్డి ని ఎన్నుకోవడం జరిగింది.ఈ ఎన్నిక జరిగిన సందర్భంగా కనిగిరి నియోజకవర్గ వైసీపీ నాయకులు మరియు మండల నాయకులు తదితరులు సుబ్బారెడ్డిని అభినందించడం జరిగింది.ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎంపీటీసీల ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్న సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి వీరభద్రచారికి మరియు తోటి ఎంపీటీసీ లకు సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img