Monday, May 6, 2024
Monday, May 6, 2024

నాకు వయసైపోయింది..కళ్లజోడు పెట్టుకుని ఫొటో పోస్ట్‌ చేసిన మంత్రి కేటీఆర్‌

తన వయస్సు అయిపోతుందని చమత్కరించారు మంత్రి కేటీఆర్‌. సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉండే కేటీఆర్‌ తన గురించి ఆసక్తికర ట్వీట్‌ చేశారు. కార్యాలయంలో కళ్ల జోడు పెట్టుకొని కంప్యూటర్‌ స్క్రీన్‌ చూస్తున్న ఫొటో షేర్‌ చేశారు. కళ్ల జోడు పెట్టుకునేందుకు మొన్నటిదాకా ఇష్టపడలేదని చెప్పారు. కానీ, ఇప్పుడు అవి లేకుండా చదవలేకపోతున్నానని తెలిపారు. ఈ లెక్కన తన వయసైపోయిందని అధికారికంగా చెప్పొచ్చు అని చమత్కరించారు. ఈ ట్వీట్‌, ఫొటో చూస్తుంటే ఆయనకు సైట్‌ వచ్చినట్టు అర్థం అవుతోంది. మంత్రి కేటీఆర్‌ ఇప్పటి వరకు కళ్ల జోడు ధరించి బయట కనిపించింది లేదు. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం సన్‌ గ్లాసెస్‌ పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img