Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పనుకువలసలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం

ఎమ్మెల్యే అలజంగిజోగారావు

విశాలాంధ్ర,పార్వతీపురం: బలిజి పేట మండలంలోని పనుకువలస గ్రామంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు సారధ్యంలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం మూడోరోజు కొనసాగింది.శుక్రవారంనాడు ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకుని వారికి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించి, సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి
మీరంతా ఆశీర్వదించి మరోమారు ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img