Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసిపి

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

విశాలాంధ్ర – ఉరవకొండ : రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్ని వస్తువులు పైన విపరీతంగా ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు సోమవారం సాయంత్రం వజ్రకరూరు మండలం వెంకటం పల్లి తాండ గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అన్ని వర్గాల ప్రజల్లో కూడా తీవ్రంగా వ్యతిరేకత ఉందన్నారు విధానాలను వ్యతిరేకించే వారిపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img