విశాలాంధ్ర,సీతానగరం: మండలంలోని కోటసీతారాంపురం గ్రామంలో ఆర్నిపల్లి రాములు రైతుపొలంలో వరిపంటకోత ప్రయోగంను మంగళ వారం నిర్వహించారు.పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.హేమలత పర్యవేక్షణలో దీన్ని నిర్వహించారు.ఈప్రయోగంలో రైతుకు చెందిన 5×5 పంటకు సంబందించి 12.38కేజీల దిగుబడి వచ్చిందని మండల వ్యవసాయధికారి అవినాష్ తెలిపారు. సీతానగరంమండలంలో 128 వరిపంట కోతప్రయోగాలు నిర్వహించడం జరుగుతుందని ఆర్డీఓకు వివరించారు.ప్రతీగ్రామాన్ని ఒకయూనిట్ గా తీసుకొని 4 లేదా6పంటకోత ప్రయోగాలు నిర్వహిస్తామని ఆర్డీఓ హేమలత చెప్పారు. ఒక యూనిట్ లో వచ్చిన దిగుబడి ఆధారంగా పంటలఇన్సూరెన్స్ మొత్తం గ్రామ యూనిట్ గా నిర్ణయించడం జరుగుతుందని వివరించారు.
ఈకార్యక్రమంలో జిల్లా ఉపగణాంక అధికారి జయ ప్రకాష్,తహశీల్దార్ ఎన్వీ రమణ,మండల వ్యవసాయ అధికారి అవినాశ్, మండల గణాంక అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ అధికారి, రైతులు పాల్గొన్నారు.