విశాలాంధ్ర`వత్సవాయి : మండలం లోని గోపీనేనిపాలెం గ్రామంలో మంగళవారం కొమరగిరి చారిటబుల్ సొసైటీ మరియు చిన్నవటపల్లి పిన్నమనేని సిద్ధార్థ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.. గోపినేనిపాలెం మరియు పరిసర గ్రామాల నుండి దాదాపు 160 మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు… వారిలో 8 మందికి కంటి ఆపరేషన్ కి రిఫర్ చేయగా వారిని ప్రత్యేకంగా హాస్పటల్ వారి బస్సులో ఆపరేషన్ నిమిత్తం పంపించడం జరిగింది.. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులు కొమరగిరి భరద్వాజ్ మాట్లాడుతూ కొమరగిరి చారిటబుల్ సొసైటీ మరియు శ్రీ సాయి సెంచరీ హై స్కూల్ ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా మక్కపేట మరియు పరిసర గ్రామ ప్రజలకు వైద్యపరంగా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సెంచరీ స్కూల్ ప్రిన్సిపాల్ కొమరగిరి సవిత, పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాల డాక్టర్లు భవిత, మానస, విద్య, పీఆర్ఓ రాఘవ, గోపీనేనిపాలెం సచివాలయం సిబ్బంది తదితరులు పాలుగొన్నారు.