ఆదోని విద్యుత్ ఏడి పురుషోత్తం
విశాలాంధ్ర ఆస్పరి : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ బదిలీ తప్పనిసరి అని ఆదోని డివిజన్ విద్యుత్ శాఖ ఏడి పురుషోత్తం పేర్కొన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణంలో బదిలీపై వెళ్లిన ఏఈ బాబా ఆజాద్, ఇటీవలే ఇన్చార్జి ఏఈగా బాధ్యతలు తీసుకున్న మల్లికార్జుకి సన్మాన సభ నిర్వహించారు. ముందుగా ఇన్చార్జి ఏఈ మల్లికార్జున, వివిధ గ్రామాల లైన్ మెన్, విద్యుత్ కాంట్రాక్ట్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు ఏఈ బాబా ఆజాద్ ను ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆదోని ఏడి పురుషోత్తం మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగం కత్తి మీద సాములాంటిదని, ఇతర శాఖల అధికారుల మాదిరి సమయానికి వచ్చి వెళ్లడానికి ఉండదని, ఏ సమయంలో ఎలాంటి విపత్తు ఎదురవుతుందో ఎవ్వరికీ తెలియదన్నారు. రైతులకు వ్యవసాయపరంగా అన్నివేళలా విద్యుత్ సరఫరా చేసి వారి మన్ననలను పొందిన వ్యక్తి బాబా ఆజాద్ అన్నారు. నిత్యం ప్రజలకు, సిబ్బందికి అందుబాటులో ఉండి విద్యుత్ బిల్లులు చెల్లింపులో ప్రత్యేక చొరవ చూపారన్నారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ చిన్నయ్య, భాస్కర్, వివిధ గ్రామాల లైన్ మెన్ లు, ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు.