Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బిసి సభకి తరలివెళ్లిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు

విశాలాంధ్ర : ఉరవకొండ: విజయవాడలో 7వ తేదీ బుధవారం జరుగుతున్న జయహో బిసి సభలో పాల్గొనేందుకు ఉరవకొండ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన బీసీ నాయకులు తరలివెళ్లారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండ పట్టణ, వివిధ మండలాల కన్వీనర్లు,రాష్ట్ర డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో వివిధ వాహనాల్లో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి విజయవాడ బిసి సభకి వెళ్లారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా పలువురు బిసి నేతలు మాట్లాడుతూ బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడిపించేందుకు సీఎం కృషిచేస్తున్నార‌న్నారు. ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, చైర్మన్, డైరెక్టర్‌ పదవులు ఇచ్చారన్నారు. అదే విధంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారని వారు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాటుపడుతున్నారుని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img