Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రైల్వే బోర్డు ఛైర్మన్‌గా అనిల్‌ కుమార్‌

భారతీయ రైల్వే బోర్డు సీఈవో, చైర్మన్‌ గా 1984 ఐఆర్‌ఎస్‌ (ఇండియన్‌ రైల్వే సర్వీస్‌) బ్యాచ్‌ కు చెందిన అనిల్‌ కుమార్‌ లహోటి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర నియామకాల కేబినెట్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇంతకుముందు లహోటీ రైల్వే బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. రైల్వే మేనేజ్‌ మెంట్‌ సర్వీస్‌ లెవెల్‌-17లో తొలుత ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. గ్వాలియర్‌లో మాధవ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌లో సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అనిల్‌, ఐఐటీ రూర్కీలో పీజీ పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img