Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

కాంస్యం గెలిచిన భజరంగ్‌
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. 65 కేజీల ఫ్రీస్టైల్‌లో భజరంగ్‌ పూనియా కాంస్య పతకంను కైవసం చేసుకున్నాడు. ఈరోజు కాంస్య పతక పోరులో భజరంగ్‌ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8-0 తేడాతో మెడల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఇది ఆరో పతకంకాగా.. 57 కేజీల విభాగంలో పోటీపడిన రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా ఇప్పటికే రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. కాంస్య పతకం కోసం సాగిన మ్యాచ్‌లో కజకస్తాన్‌కు చెందిన దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌తో ఇండియన్‌ స్టార్‌ రెజ్లర్‌ భజరంగ్‌ పూనియా పోటీపడ్డారు. ఫస్ట్‌ పీరియడ్‌లో భజరంగ్‌ మొదట ఓ పాయింట్‌ సాధించాడు. సెకండ్‌ పిరియడ్‌లోనూ బజరంగ్‌ పునియా ఆధిపత్యం కొనసాగింది. ఆ పీరియడ్‌ ఆరంభంలోనే భజరంగ్‌ రెండు పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. ఆ పీరియడ్‌లో ఆరు పాయింట్లు గెలిచాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img