Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించిన జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్

విశాలాంధ్ర-ఉరవకొండ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఉరవకొండ నియోజక వర్గంలో శనివారం క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ ఉరవకొండలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రవేశ పెట్టిన క్రియ శీలక సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్త కి బరోసా కల్పించడానికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5లక్షల భీమా చెక్కు, ప్రమాదంలో గాయపడిటే 50 వేలు హాస్పిటల్ ఖర్చులను పార్టీ నుంచి సహాయం చేసేలా చూస్తారని తెలిపారు. క్రియ శీలక సభ్యత్వ కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 28 వ తేదీ వరకు ఉంటుందని జనసేన పార్టీ కళాశీలక సభ్యత్వం కోసం ఆధార్ కార్డు, పాస్ ఫోటో, నామిని ఆధార్, 500 రూపాయల సభ్యత్వము ఫోన్ నెంబర్ తో ఆసక్తి కలవారు సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమం లో వజ్రకరూరు అద్యక్షులు కేశవ్, విడపనకల్ మండల అధ్యక్షులు గోపాల్, బెలుగుప్ప, మండల్ అద్యక్షులు సుధీర్, జనసేన నాయకులు రాజేష్, హారిశశీకర్ నాయక్,తిలక్,సురేష్,గోపి ,నారాయణ, తిప్పయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img