హైదరాబాద్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ఎఫ్ఎన్సీసీలో శనివారం ఎఫ్ఎన్సీసీ 11వ ఆలిండియా ఒపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. సినీనటుడు జీవితా రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న టోర్నీలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి ఆటగాళ్లు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్సీసీ ఉపాధ్యక్షుడు రంగారావు, ప్రధాన కార్యదర్శి ముళ్ళపూడి మోహన్, కోశాధికారి రాజశేఖర్ రెడ్డి, కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.