Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగుకు ఏర్పాట్లు పూర్తి

విశాలాంధ్ర – పార్వతీపురం : ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలియజేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని, ఎన్నికలకు సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బ్యాలెట్ బాక్సులు సీల్ చేసినపుడు, ఓపెన్ చేసే సమయాల్లో వీడియో తప్పనిసరిగా తీయించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్లను కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ విధానంపై పోలింగు అధికారులకు, సహాయ పోలింగు అధికారులకు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ సామగ్రి పంపిణీ మరియు స్ట్రాంగ్ రూమ్ లకు పంపేందుకు రవాణా సదుపాయాలను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు.
ఈసమావేశంలో ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి సి.విష్ణుచరణ్, జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకటరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img