Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి…

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కన్ను అండ్ వృద్ధుల వైద్యశాల- మధు ఆప్టికల్స్ నందు ఆదివారం ప్రపంచ నీటి కాసుల వ్యాధి వారోత్సవాల సందర్భంగా పట్టణ గ్రామీణ పేద ప్రజల కొరకు ఉచిత కంటి వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ జిల్లా ఆందత్వ నివారణ అధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారు, కంటి శుక్లము, నీటి కాలుష్యవాది తదితర వ్యాధులకు ఉచిత వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చి కూడా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img