Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మేఘాలయ వర్సిటీని సందర్శించిన జేఎన్టీయూ ఉపకులపతి

విశాలాంధ్ర – జేఎన్టీయూ : యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ, అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ న్యూఢిల్లీ సంయుక్తంగా 97వ జనరల్ బాడీ మీటింగ్ సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య జింక జనార్ధన్ హాజరయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్లు పాల్గొన్నారు. ప్రధానంగా యూనివర్సిటీలలో నెలకొన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేయవలసిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేయూ వీసి ప్రొ. రామకృష్ణారెడ్డి, కృష్ణ యూనివర్సిటీ వీసి ఆనంద్ రావు, మొదలగు యూనివర్సిటీ వీసి లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img