Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఐ ఆర్ సి ఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు కంటి పరీక్షలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఇండియా రెడ్ క్రాస్ సొసైటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరియు ఎల్.వి.ప్రసాదు ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా రాష్ట్రవ్యాప్తంగా బాల బాలికల సంరక్షణ కేంద్రాలలో కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కంటి పరీక్షలు నిర్వహించిన బాల బాలికల సంరక్షణ కేంద్రాలు అనగా శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి లోని మంగళకర ఎడ్యుకేషన్ చిల్డ్రన్స్ హోమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ లో 16 మందికి, ఎయిర్పోర్ట్ రోడ్ హ్యాపీ హోమ్ ట్రస్ట్ 09 మందికి, కర్నాటక నాగేపల్లి హోలీ సిటి మినిస్ట్రీ హోమ్ లో ఒకరికి, ప్రేమ ధర్మ చారిటబుల్ ట్రస్ట్ లో ఇద్దరికి,బత్తలపల్లి లో నే ఆర్ డి టి మనో వికాస కేంద్రం లో 7 మందికి ,మెదడు పక్షపాత కేంద్రలో ముగ్గురు కు, హెచ్ ఐ వి బాధిత చిల్డ్రన్స్ కు 4 గురు కు మొత్తం 42 మంది కి బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మరియు ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ బాలబాలికల కేంద్రాలలో కంటి అద్దాలనుఉచితంగా అందజేయడం జరిగింది. మంగళకర ఎడ్యుకేషన్ ట్రష్టి ఆర్య ప్రకాష్ మేడం , ప్రిన్సిపాల్ బిందుజా మేడం హ్యాపీ హోమ్ ట్రస్ట్ రంజిత మేడం సంతోషం వ్యక్తం చేశారు.
పిల్లలకు ఉచితంగా ఇవ్వడం వలన వారు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళుతారని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మరియు ఎల్వి ప్రసాద్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ బి. రమేష్
ఎల్.వి.ప్రసాద్ కోఆర్డినేటర్ రఫిక్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ బత్తలపల్లి సెంటర్స్ ఇంఛార్జిలు సిస్టర్స్ ఆగ్నేస్, క్యాథరిన్, సబితా, విద్యార్ధులు పాలోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img