Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

టిడిపి బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయండి…

టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : రాష్ట్రంలో వైయస్సార్సీపీ పాలన ప్రజలపై భారం పడిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టిడిపి పార్టీ బలోపేతానికి టిడిపి కార్యకర్తలు కృషి చేయాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంధ్ర గౌడ్ అన్నారు. సోమవారం మహేంద్ర కళ్యాణ మండపంలో ఇంటిగ్రెటెడ్ శిక్షణ కార్యక్రమం మోహన్ రాజ్ ,మహేష్, నరసింహులు,మధు, పులికొండలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంధ్ర గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ పరిపాలన ప్రజలకు పెనుబారంగా మారిందని ప్రభుత్వాన్ని గద్ద దింపేందుకు టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. గత నాలుగు సంవత్సరాలుగా అధికారంలో లేకున్నా నా వెంట ఉండి ముందుకు నడిపించిన పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపి నాయకులకు భయపడద్దని ఈ నియోజకవర్గంలో మనల్ని భయపట్టే నాయకులు లేరని భయాన్ని పక్కనపెట్టి టిడిపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజవర్గంలో ఎటువంటి సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా ఒక్క ఫోన్ చేస్తే చాలు నేనున్నానని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కేసీ హరి ,టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ గౌడ్, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి,టిడిపి మాజీ ఎంపీపీ ప్రతాప్ నాయుడు,టిడిపి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు వెంకటేష్ ,తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వాల్మీకి రాము,టిడిపి నాయకులు కురువ శివన్న ,రంజాన్, కురువ సురేష్, పులికొండ ,హనుమంతు, తలారి మస్తానప్ప,తలారి శివ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img