అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పిలుపు
మెగాస్టార్ పుట్టినరోజంటే అభిమానులకు పండగే. ఆయన పుట్టినరోజును అభిమానులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. రక్తదానం, అన్నదానం, కేక్ కటింగ్ ఇలా విభిన్న రకాలుగా జరుపుకుంటారు. ఈ సారి తన పుట్టినరోజునాడు వినూత్నంగా ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు చిరంజీవి పిలుపునిచ్చారు. ఆ విధంగా తనపై ప్రేమను చాటాలని కోరారు. భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని ట్వీట్ చేశారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం ‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’’లో తన అభిమానులంతా పాల్గొని, మూడు మొక్కలు నాటి, తనకు ట్విట్టర్లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. చిరంజీవి ట్వీట్పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్కు కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు.