Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఘనంగా సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ట

విశాలాంధ్ర-రాప్తాడు : భక్తుల ఆరాధ్యదైవం, కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం శ్రీసీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్టా మహోత్సవం మండలంలో ఎం.క్రిష్ణాపురం గ్రామంలో మేళతాళాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్యన శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, రిటైర్డు జడ్జి కిష్టప్ప హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనురాధ నక్షత్రయుక్త మిథునలగ్నంలో విగ్రహ ప్రతిష్టాపన, బింబ కళాన్యాసములు, ప్రాణప్రతిష్ట, కక్షాగ్ని జ్వాలి, కూష్మాండ, మహోదనబలి, అనంతరం పూర్ణాహుతి, కళశ ఉద్యాసన, మూర్జనం, కుంభాభిషేకం, కేద ఆశీర్వచనం నిర్వహించారు. అదేవిధంగా ఆత్మకూరులో శ్రీ కాశీ విశ్వనాథ హనుమత్సహిత సీతారామ లక్ష్మణ స్వామి వార్ల సహిత శ్రీ మత్కన్యకా పరమేశ్వరి అమ్మవారి స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు బిజడ్పీటీసీ పసుపుల హేమావతి, కన్వీనర్, యూత్ కన్వీనర్లు జూటూరు శేఖర్, చిట్రెడ్డి సత్తిరెడ్డి, ఎంపిటీసీ బోగే లక్ష్మీదేవి, నాయకులు మరూరు కొండారెడ్డి, ఆది, నారాయణస్వామి, రామచంద్రారెడ్డి, పక్కీరప్ప, పసుపుల నారాంజి, కృష్ణాపురం రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img