Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అయోధ్యను సందర్శించనున్న రాష్ట్రపతి కోవింద్‌

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అయోధ్యను సందర్శించనున్నారు. ఈనెల 26 నుంచి 29 మధ్య ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, గోరఖ్‌పూర్‌, అయోధ్యలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ పర్యటించనున్నారని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆయన యూపీకి రైలులో వెళ్లనున్నట్లు తెలిసింది. రాష్ట్రపతి అయోధ్యకు వెళ్తారని, అక్కడ జరుగుతున్న రామాలయ నిర్మాణ పనులను ఆయన పర్యవేక్షించనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. అక్కడ అనేక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. తులసి స్మారక భవనం, నగర బస్‌ స్టాండ్‌, అయోధ్య థామ్‌ నిర్మాణ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో కోవింద్‌ లక్నోలో పర్యటిస్తారని, రెండు కాన్వకేషన్‌ సెర్మనీల్లో పాల్గొంటారని తెలిపింది. 28న గోరఖ్‌పూర్‌లోని మహాయోగి గురు గోరక్‌నాథ్‌ ఆయుష్‌ మహావిద్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img