Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అఫ్ఘానిస్తాన్‌లో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం

అఫ్ఘానిస్తాన్‌లో నెలకొన్న పరిణామాలు, భారత ప్రభుత్వం చేపడుతున్న తరలింపు చర్యలపై కేంద్రమంత్రి జైశంకర్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. అఫ్ఘాన్‌లో పరిస్థితిపై వివిధ పార్టీల నేతలకు ఆయన వివరించారు. అక్కడ ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని జైశంకర్‌ చెప్పారు. నిన్న 35 మందిని భారత్‌కు తీసుకొచ్చినట్లు తెలిపారు. ఖతార్‌ రాజధాని దోహాలో జరిగిన శాంతి ఒప్పందంలో తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని అన్నారు. ఈ సమావేవానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత, ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img