Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డిబీర్స్‌ ఫరెవర్‌ మార్క్‌ ఆధ్వర్యంలో ఇండియా ఫోరమ్‌

హైదరాబాద్‌ : ప్రపంచ అగ్రగామి వజ్రాల కంపెనీ డి బీర్స్‌ మూడు రోజుల పాటు జరిగిన తన 10వ వార్షిక ఫోరమ్‌లో పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. డి బీర్స్‌ ఫరెవర్‌ మార్క్‌ రీబ్రాండ్‌, ఫరెవర్‌ మార్క్‌ అవంతి కలెక్షన్‌, ఆరిజిన్‌ ప్రోగ్రామ్‌ నూతన కోడ్‌, నేషనల్‌ జియోగ్రాఫిక్‌తో నూతన భాగస్వామ్యం వంటివి ఇందులో ఉన్నాయి. వర్చువల్‌, ఇన్‌ పర్సన్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది దేశవ్యాప్తంగా 8 లక్షల మంది భాగస్వాములు, వజ్రాల నిపుణులు, తయారీదారులు, కొనుగోలుదారులను చేరుకుంది. ఈ ఏడాది థీమ్‌ ‘మేక్‌ లైఫ్‌ బ్రిలియంట్‌’ అనేది తన కొనుగోలుదారులు, సమాజం జీవితాన్ని బ్రిలియంట్‌ చేయడంపై డి బీర్స్‌కు గల విశ్వాసాన్ని ప్రతిఫలిస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా ఫరెవర్‌ మార్క్‌ ను డి బీర్స్‌ ఫరెవర్‌ మార్క్‌గా రీబ్రాండ్‌ చేశారు. కంపెనీ విస్తృత పరివర్తనలో భాగంగా ఇది చోటు చేసుకుంది. అంతేగాకుండా డి బీర్స్‌ ఫరెవర్‌ మార్క్‌ తన తాజా కలె క్షన్‌ ఫరెవర్‌ మార్క్‌ అవంతి ఫైన్‌ జ్యుయలరీ కలెక్ష న్‌ ని కూడా ఆవిష్కరించింది. 18కె ఎల్లో, వైట్‌, రోజ్‌ గోల్డ్‌ లో సర్క్యులర్‌ డిజైన్లలో ఈ కలెక్షన్‌ లభ్యమవుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img