Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాఠశాలలో మంత్రి హరీష్‌ ఆకస్మిక తనిఖీ

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి మండల ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి హరీష్‌రావు మంగళవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి ఉపాధ్యాయులు రాకపోవడంపై మంత్రి మంత్రి అగ్రహం వ్యక్తం చేశారు.పాఠశాల ఆవరణ ప్రాంగణం బురదమయంగా మారిందని మొరం పోయించి చదును చేయించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలును ఆదేశించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్‌ఏంకు సూచించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా.. చొరవ చూపాలన్నారు. విద్యార్థుల చేతులు సబ్బుతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. వీటిని ప్రతి విద్యార్థి పాటించేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img