ఏపీలో ఆరుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్డీఏ కమిషనర్గా కె.విజయ, సీసీఎల్ఏ అప్పిల్స్ కమిషనర్గా డా. పి.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్ బదిలీ అయ్యారు.