Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

కోలాహలంగా కె.ఎస్.ఎన్. నామినేషన్ …

రాజుకు పసుపు తివాచీ పరచిన చోడ ‘వరం ‘

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.25.04.2024ది. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి చోడవరం ఎమ్మెల్యే అభ్యర్ధి కె.ఎస్.ఎన్.ఎస్. రాజు వెంట గురువారం భారీ సంఖ్యలో అభిమానులు రాగా కోలాహలంగా నామినేషన్ వేసారు. సుమారు 50,000 మంది కార్యకర్తలతో స్థానిక వేంకటేశ్వరుని ఆలయం దగ్గర నుండి కొత్తూరు వరకు ర్యాలీగా బయలుదేరి తహసిల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ ఏ.జి చిన్ని కృష్ణ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. అభిమానులు కోలాహలంతో చోడ’వరం ‘ పసుపు తివాచీ పరచి రాజులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కె.ఎస్.ఎన్. వెంట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు, గోవాడ సుగర్స్ మాజీ చైర్మన్ గూనూరు మల్లు నాయుడు, జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు, బి.జె.పి.మీడియా ఇన్చార్జి ఈర్లె శ్రీరామ మూర్తి, సిరిపురపు శ్రీను, నియోజకవర్గం పరిధిలో గల రావికమతం, రోలుగుంట, బుచ్చయ్యపేట నుండి కార్యకర్తలు, నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img