Friday, April 26, 2024
Friday, April 26, 2024

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

విశాలాంధ్ర -ఉరవకొండ : అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోనే భాగమైన సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఉరవకొండ
మండలంలోని చిన్న మూస్టురు గ్రామంలో బుధవారం ఃగడప గడపకు మన ప్రభుత్వంః కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇన్ను సంక్షేమ పథకాలు పేదలకు లేవని అని తెలిపారు అనంతరం మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా
పలువురు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే ఆదేశించారు.ఆయన వెంట మండల వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img