విశాలాంధ్ర-తాడిపత్రి: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎస్. గైబువల్లికి మద్దతు ఇవ్వండని యువ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీ హిందీ ప్రచారసభ జాయింట్ సెక్రటరీ డి. పెద్దహాజీవలి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగస్తులను ప్రైవేట్ పాఠశాల, కళాశాలలోని ఉపాధ్యాయుల ను, పలు పట్ట భద్రులను కలసి రాబోయే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్. గైబువల్లికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎస్.గైబువల్లి ని ఎమ్మెల్సీగా గెలిపిస్తే నిరుద్యోగ, ఉద్యోగ, ఉపాధ్యా యుల, కాంట్రాక్టు, పట్టభద్రుల సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువ ఉపాధ్యక్షులు ఆర్.బి మధుసూదన్, తాడిపత్రి జోన్ ప్రధాన కార్యదర్శి బోసి రామచంద్ర పాల్గొన్నారు.