Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డికె ఓటు వేయండి

విశాలాంధ్ర-రాప్తాడు : టీడీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శ్రీనివాసులు కోరారు. మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ ఆదేశాల మేరకు మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా మంగళవారం ఎం.బండమీదపల్లి గ్రామంలో గ్రాడ్యుయేట్ ఓటర్లను అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహించారు. మూడున్నర ఇళ్లలో రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, వైసిపిపై యువతలో, ఉద్యోగుల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉందన్నారు. భారీ మెజారిటీతో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బోయ వెంకటరాముడు, పెద్ద చెన్నారెడ్డి, సర్పంచులు సాకే తిరుపాలు, ఉజ్జినప్ప ఎంపీటీసీ జాఫర్ ఖాన్, భోగినేపల్లి రమేష్ నాయుడు బోయ అక్కులప్ప, గవ్వల మహేష్, దేవర నారాయణస్వామి, గంగలకకుంట కృష్ణ, గేట్ సత్తి, హెచ్.సుబ్బరాయుడులి సింగంపల్లి నరేంద్ర జిఎల్ తమ్మినేని నరేష్, దేవర రమేష్ పలిపి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img