Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎస్సీ ఎస్టీలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించండి

విశాలాంధ్ర-రాప్తాడు..|స్సీ,ఎస్టీలపై దాడులు, దౌర్జ్యన్యాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి కోరారు. శుక్రవారం రాప్తాడు ఎస్ఐ ఆంజనేయులును జేఏసీ అధ్వర్యంలో కలిసి ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం సాకే హరి విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాల్లో నేటికీ కుల వివక్షత ఉందని, అంటరానితనాన్ని రూపు మాపాలన్నారు. దళిత, గిరిజనులకు చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుకొని మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికే ఇళ్ళ స్థలాలు, వ్యవసాయ భూములు, గడ్డివాములు, దిబ్బలు చివరకు స్మశాన వాటికలు సైతం ఆక్రమించుకొన్న కబ్జాదారులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి దళిత, గిరిజనుల ప్రాణాలు కాపాడాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రేకులకుంట రామాంజనేయులు, ముత్యాలమ్మ, రామకృష్ణ, చెన్న కేశవ, ప్రతాప్, కందుకూరు రాము, శ్రీరామ్, లక్ష్మయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img