Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఘనంగా జరిగిన జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర^ ధర్మవరం : పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శుక్రవారం జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మల దేవి మాట్లాడుతూ రైతు యొక్క జీవన శైలిని, అహర్నిశలు కష్టపడి దేశానికి చేస్తున్న సేవలను, రైతులు పడే శ్రమను చక్కగా వివరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా రైతే రాజు అనే నాటిక అందరిని ఆకర్షించడం జరిగిందన్నారు. రైతు యొక్క ప్రాముఖ్యతను తెలిపేందుకే ఈ జాతీయ రైతు దినోత్సవ వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా రైతు యొక్క గొప్పతనాన్ని కూడా వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్య ప్రకాష్ రెడ్డి, పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img