Friday, April 26, 2024
Friday, April 26, 2024

చలివేంద్రాలు ఎంతోమందికి దాహార్తిని తీరుస్తాయి.. రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్

విశాలాంధ్ర -ధర్మవరం : చలివేంద్రాలు ఎంతోమందికి దాహార్తిని తీరుస్తాయని రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్ పేర్కొన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని, వేసవికాలం ప్రారంభం కావడం ఎండలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో పాదచారులు పట్టణ ప్రజలు వివిధ పనుల మీద వచ్చే ప్రజలకు ఈ చలివేంద్రాన్ని పట్టణంలోని కేశవ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా కన్నా వెంకటేష్ తో పాటు సభ్యులు ఉదయ్ కుమార్, ఉమేష్,సహృదయం హెల్పింగ్ హాండ్స్ వెంకటరమణ మాట్లాడుతూ ఈ చలివేంద్ర ఏర్పాటుకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క దాతకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలపడం జరుగుతుందని వారు తెలిపారు. మున్ముందు మరిన్ని చోట్ల కూడా చలివేంద్ర ఏర్పాట్లకు కృషి చేస్తామని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img