Friday, April 26, 2024
Friday, April 26, 2024

చేనేత కార్మికులకు చేనేత పరికరాల పంపిణీ.. చేనేత జౌళి శాఖ అధికారి.. రమేష్

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శాంతినగర్ లో గల కెవిఎస్ ప్రభుత్వ పాఠశాల యందు జాతీయ చేనేత అభివృద్ధి పథకంలోని హెచ్ ఎస్ అంశం కింద 48 మంది ఎస్సీ చేనేత కార్మికులకు మోటారు లిఫ్టింగ్ మిషన్లు, ఆరు గుంత/ ఫ్రీమ్ మగ్గములు పంపిణీ చేయడం జరిగిందని చేనేత జౌళి శాఖ అధికారి రమేష్ గురువారం పేర్కొన్నారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ ఈ పరికరాలను ఆయా వార్డ్ కౌన్సిలర్ల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ప్రభుత్వం ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన చేనేత కార్మికులకు ఈ పరికరాలను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీ చేనేత కార్మికులు 10 శాతము కడితే ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, వైఎస్సార్ చేనేత జిల్లా అధ్యక్షులు కంబగిరి పెద్దన్న, విజయానంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img