Friday, April 26, 2024
Friday, April 26, 2024

చేనేత కుటుంబానికి ఆర్థిక సహాయం… జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని రామ్ నగర్ లో అప్పుల బాధతో పూజారి రాము అనే చేనేత కార్మికుడు గురువారం మృతి చెందడంతో, సమాచారం అందుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. అనంతరం తనవంతుగా ఆ కుటుంబానికి భార్య పద్మావతికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ కరోనా సమయములో చేనేత కార్మికులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని, ఇప్పటికీ కూడా నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం, ముడి పట్టు సరుకులు అధిక ధరలతో ఉండడం ఒక కారణమైతే, కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువుకొరకు అనేక అప్పులు చేయడం బాధాకరమన్నారు. అప్పుల బాధ ఒత్తిళ్లు తాళలేక మృతి చెందడం శోచనీయమన్నారు. వెంటనే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img