Friday, April 26, 2024
Friday, April 26, 2024

టీచర్స్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు కత్తి నరసింహారెడ్డి కి పోతుల నాగరాజుకు మద్దతుగా సీపీఐ ప్రచారం…

విశాలాంధ్ర-గుంతకల్లు : పశ్చిమ రాయలసీమ పట్టబధ్రుల ఎస్ టి యు, యుటిఎఫ్, పిడిఎఫ్, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం సోమవారం సీపీఐ , ఏఐఎస్ ఎఫ్ పట్టణంలో మేరీ మాత చర్చి హై స్కూల్ , తెలుగు మీడియం స్కూల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య ఆహ్వానితులుగా సీపీఐ పట్టణ కార్యదర్శి ఎస్ గోపీనాథ్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఉపాధ్యాయ హక్కుల కోసం కాంటాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ చేయడం కోసం ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నిరంతరం పోరాడుతున్న కత్తి నరసింహారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాలని అదేవిదంగా సామాజిక కార్యకర్త పోతుల నాగరాజు కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ రెండో కూడా ప్రజా సమస్య పరిష్కారంలో విఫలం మయ్యాయి అన్నారు. నిత్యం ప్రజా సమస్యల పైన పోరాడుతున్న కార్మిక సంఘాలు కాత్తి నరసింహారెడ్డి కి పోతుల నాగరాజు కి మద్దతుగా నిలిచాయని అన్నారు. నిరుద్యోగ యువత మేధావులు ఆలోచన చేసి నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ ఆర్గనైజేషన్ కార్యదర్శి వినోద్,డిహెచ్ పి ఎస్ నాయకులు మల్లయ్య, ఏఐఎస్ఎఫ్ నాయకులు శిక్షావలి, రాజేష్ ,శివమణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img