మంత్రి ఉషశ్రీ చరణ్
విశాలాంధ్ర`బ్రహ్మసముద్రం : రాష్ట్ర ప్రజల సంక్షేమమే ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని ఒంటిమిది దేవాదుల కొండ గ్రామాలలో వార్డు కౌన్సిలర్ సురేష్తో కలిసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం కోసం అధికారులు ఆదేశించారు. జగనన్న ప్రవేశపెట్టిన ప్రతి పథకము ప్రజా శ్రేయస్సు కోసమేనని పథకాల అమలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరీటి యాదవ్ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.