లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున
విశాలాంధ్ర`ఉరవకొండ : సమాజం యొక్క అభివృద్ధిలో జర్నలిస్టులది కీలకపాత్రని ఉరవకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున అన్నారు. గురువారం స్థానిక లన్స్ క్లబ్ లో జాతీయ పత్రిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సప్తగిరి మల్లికార్జున మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి,చెడు సంఘటనలను వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో జర్నలిస్టులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ పత్రికలకు ప్రాధాన్య తగ్గలేదన్నారు భవిష్యత్తులో ఈ రంగాన్ని నిలబెట్టుకోవడానికి నిష్పక్షపాతంగా వార్తలను రాస్తూ పత్రికారంగాన్ని మరియు జర్నలిస్టు యొక్క విలువలను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ బాలచంద్ర సభ్యులు గణేష్ బాబు, ప్రభాకర్ నాయుడు, ఎంసీ నాగభూషణం, జయ కృష్ణ శ్రీరాములు, సత్యనారాయణ, మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు.